Rishabh panth: మైదానంలో పంత్‌పై ‘భారత్ ఆర్మీ’ పాట.. ఉత్సాహంగా పెదవి కలిపిన అభిమానులు

  • మాకొక పంత్ ఉన్నాడంటూ పాట
  • సిక్సర్లూ కొడతాడు.. పిల్లల్నీ ఆడిస్తాడంటూ సాగిన పాట
  • సోషల్ మీడియాలో వైరల్

టీమిండియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అభిమానులు ఆయనపై పాడిన పాట వైరల్ అవుతోంది. ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్- రిషభ్ పంత్ మధ్య ఓ రేంజ్‌లో స్లెడ్జింగ్ జరిగింది. అయితే, దానిని మైదానానికే పరిమితం చేసిన పంత్-పైన్‌లు ఆ తర్వాత చక్కగా కలిసిపోయారు. న్యూ ఇయర్ సందర్భంగా పైన్ పిల్లల్ని పంత్ ఎత్తుకుని ఆడించాడు.

ఇక శుక్రవారం పంత్ బ్యాటింగ్‌లో రెచ్చిపోతున్నప్పుడు ‘భారత్ ఆర్మీ’ అనే టీమిండియా అభిమానుల బృందం పాటందుకుంది. పంత్-పైన్ మధ్య జరిగిన స్లెడ్జింగ్‌ను గుర్తుకు తెస్తూ పాట సాగింది. ‘మాకు పంత్ ఉన్నాడు.. రిషభ్ పంత్, ఈ విషయం మీకు అర్థం అయిందని నేననుకోను, అతడు సిక్సర్లూ కొట్టగలడు, పిల్లల్నీ ఆడించగలడు’’ (వియ్ హ్యావ్ గాట్.. రిషభ్ పంత్, ఐ జస్ట్ డోంట్ థింక్ యు విల్ అండర్‌స్టాండ్, హి విల్ హిట్ యు ఫర్ సిక్స్, హి విల్ బేబీసిట్ యువర్ కిడ్స్) అని పాటపాడుతూ స్టేడియాన్ని హోరెత్తించారు. వారి పాటకు స్టేడియంలోని అభిమానులు కూడా పెదవి కలుపుతూ ఉత్సాహాన్ని నింపారు.

More Telugu News