Tihar Jail: తీహార్ జైల్లో పెరిగిపోతున్న ఖైదీల సంఖ్య.. కారణం తెలుసుకుని నివ్వెరపోయిన అధికారులు!

  • ఢిల్లీలో రహదారుల పక్కన నిద్రించేవారు ఎక్కువే 
  • చలికి రోడ్ల పక్కన నిద్రించలేక నేరాలు చేస్తున్నారు 
  • సామర్థ్యం మించి పోతున్నతీహార్ జైలు 

చలికాలం ఇంట్లో ఉండటమే చాలా కష్టంగా ఉంది. ఏ దిక్కూలేక రోడ్ల మీద పడుకునే వారి పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. అయితే వీరు రోడ్లపై నిద్రించలేక నేరాలకు పాల్పడుతున్నారట. దేశ రాజధాని ఢిల్లీలో రహదారుల పక్కన నిద్రించేవారు చాలా ఎక్కువ. వీరిలో ఎక్కువ మంది చలిని తట్టుకోలేక నేరాలకు పాల్పడుతున్నారట. దీంతో తీహార్ జైల్లో ఖైదీల సంఖ్య పెరిగిపోతోంది. ఈ విషయం తెలుసుకుని జైలు అధికారులే నివ్వెరపోయారు. తీహార్ జైలు సామర్థ్యం 10,027 మంది. కానీ ప్రస్తుతం అక్కడ 16000 మంది ఉన్నారు.

దీనిపై తీహార్ జైలు అధికారి ఒకరు మాట్లాడుతూ.. శీతాకాలంలో చలికి రోడ్లపై ఉండటం కంటే జైల్లో ఉండాలనే ఉద్దేశంతో కొంతమంది నేరాలకు పాల్పడుతున్నట్టు తెలిసిందన్నారు. అలా నేరాలకు పాల్పడుతున్నవారిలో ఎక్కువమంది వీధుల్లో నిద్రించే వారేనని కొందరు ఖైదీలతో తమ సిబ్బంది మాట్లాడిన సమయంలో తెలిసిందని పేర్కొన్నారు. 

More Telugu News