nagababu: ఎన్టీఆర్ బయోపిక్ పై నాగబాబు పరోక్ష వ్యాఖ్యలు

  • కవిత రూపంలో నాగబాబు కామెంట్
  • సోషల్ మీడియాలో వైరల్
  •  మెగా ఫ్యాన్స్ నుంచి భారీ రెస్పాన్స్   

ఇటీవల బాలకృష్ణ ఎవరో తనకి తెలియదని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన నాగబాబు, ఆయన అభిమానుల ఆగ్రహానికి కారకులయ్యారు. తాజాగా ఆయన బాలకృష్ణ చేస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ ను టార్గెట్ చేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ సారి కవిత్వం రూపంలో నాగబాబు చేసిన కామెంట్, సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది."కట్టు కథలు కొన్ని .. కల్పనలు ఇంకొన్ని .. చుట్టనేల .. మూట కట్టనేల .. నిజం కక్కలేని బయోపిక్కులొద్దయా .. విశ్వదాభిరామ .. వినరా మామా" అంటూ పోస్ట్ పెట్టిన నాగబాబు, 'కవిత్వాలు మాకు వచ్చండోయ్' అనేది బ్రాకెట్లో పెట్టారు. ఈ పోస్ట్ లో 'స్టే ట్యూన్డ్' అని వ్యాఖ్యానించడం ద్వారా, ఇకపై తన సోషల్ మీడియా పేజీ నుంచి ఇలాంటి సెటైర్లు వరుసగా ఉంటాయనే హింట్ ఇచ్చారు. నాగబాబు రాసిన ఈ కవితకు మెగా ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. మరి ఇది ఎలాంటి పరిణామాలకి దారి తీస్తుందో చూడాలి. 

More Telugu News