Rahul Gandhi: నాడు మోదీ సభ నిర్వహించిన చోటే.. దుబాయ్‌లో 11న రాహుల్ భారీ బహిరంగ సభ

  • ఈ నెల 11, 12 తేదీల్లో రాహుల్ దుబాయ్ పర్యటన
  • మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా భారీ బహిరంగ సభ
  • క్రికెట్ స్టేడియంలో చురుగ్గా ఏర్పాట్లు

ప్రవాస భారతీయులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగా ఈ నెల 11, 12 తేదీల్లో ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ దుబాయ్, అబుదాబిలలో పర్యటించనున్నారు. 2016లో దుబాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో భారత ప్రధాని నరేంద్రమోదీ అధికారిక హోదాలో పాల్గొన్నారు. ఇప్పుడా సభ జరిగిన చోటే ఈ నెల 11న కాంగ్రెస్ సభ నిర్వహించనుంది. దుబాయ్‌లోనే అదిపెద్దదైన క్రికెట్ స్టేడియంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ స్టేడియం సామర్థ్యం 25 వేల మంది. మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న ఈ సభలో ‘గాంధీ 150 సంవత్సరాలు-భారత్ ఒక ఆలోచన’ అన్న అంశంపై రాహుల్ ప్రసంగిస్తారు. 12న అబుదాబి సభలో రాహుల్ పాల్గొంటారు.

More Telugu News