ntr: ఎన్టీఆర్ బయోపిక్, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలకు చిక్కులు.. సెన్సార్ కొత్త కండిషన్!

  • బయోపిక్ కావడంతో కొత్త కండిషన్
  • పాత్రలకు సంబంధించిన వ్యక్తులు బతికి ఉంటే.. ఎన్ఓసీ తేవాలంటూ కండిషన్
  • సదరు వ్యక్తుల నుంచి ఎన్ఓసీ తేవడం సాధ్యమేనా?

తాజాగా సెన్సార్ బోర్డు పెట్టిన మెలిక ఎన్టీఆర్ బయోపిక్ తో పాటు, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు విఘాతంగా మారింది. జీవిత చరిత్ర నేపథ్యంలో సినిమాలు తెరకెక్కుతుండటంతో... పాత్రలకు సంబంధించిన వ్యక్తులు బతికి ఉంటే... వారి వద్ద నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకురావాలన్నదే ఆ మెలిక.

ఎన్టీఆర్ బయోపిక్ ను... కథానాయకుడు, మహానాయకుడిగా రెండు భాగాలుగా తెరకెక్కించారు. కథానాయకుడు చిత్రం ఎన్టీఆర్ సినీ ప్రస్థానానికి సంబంధించింది కావడంతో... దీనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మహానాయకుడు చిత్రం రాజకీయ నేపథ్యంలో కొనసాగనుండటంతో... ఎన్ఓసీ తీసుకురావడానికి కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు.

మరోవైపు, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రానికి మాత్రం సెన్సార్ బోర్డు కండిషన్ పెద్ద సవాల్ గా మారనుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన వెన్నుపోటు సాంగ్ వివాదాస్పదమైంది. ఈ చిత్రంలో ఉన్న పాత్రలకు సంబంధించిన వ్యక్తుల నుంచి చిత్ర యూనిట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎలా తీసుకొస్తుందా? అన్నదే ఇప్పడు హాట్ టాపిక్. 

More Telugu News