Hyderabad: యాక్టివాను ఢీకొన్న టిప్పర్... ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దుర్మరణం!

  • హైదరాబాద్, పీవీ ఎక్స్ ప్రెస్ వే వద్ద ఘటన
  • అదుపుతప్పి ఢీకొన్న టిప్పర్
  • ఆఫీసుకు వెళుతున్న ఇద్దరు మృతి

హైదరాబాద్ లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను బలిగొంది. నానక్ రామ్ గూడలోని ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్న దీపికా నిఖిల్, సయీద్ అహ్మద్ లు ఈ ఉదయం లంగర్ హౌస్ పరిధిలోని పీవీ ఎక్స్ ప్రెస్ వే, పిల్లర్ నంబర్ 102 వద్ద వెళుతుండగా, అదుపుతప్పిన టిప్పర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో దీపిక, సయీద్ లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. వీరిద్దరూ కలిసి ఆఫీసుకు వెళుతున్న వేళ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

More Telugu News