akhil: 'మిస్టర్ మజ్ను' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్

  • అఖిల్ మూడవ చిత్రంగా 'మిస్టర్ మజ్ను'
  • యూత్ ను ఆకట్టుకున్న టీజర్
  • జనవరి 25వ తేదీన విడుదల

అఖిల్ నుంచి మూడవ సినిమాగా రానున్న 'మిస్టర్ మజ్ను' కోసం ఆయన అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. విదేశీ లొకేషన్స్ లో అఖిల్ .. నిధి అగర్వాల్ కి సంబంధించిన సీన్స్ పై ఈ టీజర్ ను కట్ చేశారు. కథలోని పాత్రకి తగినట్టుగానే అఖిల్ చాలా రొమాంటిక్ గా కనిపించాడు. ఇక నిధి అగర్వాల్ లుక్స్ తోనే కుర్రకారు మనసులు దోచేసింది.

ఒక్క రాత్రిలోనే ఈ సినిమా టీజర్ 2 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుంది. అందుకు సంతోషిస్తూ ఈ సినిమా టీమ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందించాడు. జనవరి 25వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. అఖిల్ గత రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు.

More Telugu News