Andhra Pradesh: ఏపీ పాఠశాలల సంక్రాంతి సెలవుల్లో స్వల్ప మార్పులు

  • జన్మభూమి-మా ఊరు కార్యక్రమం నేపథ్యంలో సెలవుల్లో మార్పు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆదిత్యనాథ్ దాస్
  • వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

ఆంధ్రప్రదేశ్‌లోని  పాఠశాలలకు ప్రభుత్వం ఇచ్చే సంక్రాంతి సెలవుల్లో చిన్నపాటి మార్పు చోటుచేసుకుంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 8 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వాల్సి ఉండగా, వాటిని 12 నుంచి 20కి మారుస్తూ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 8 నుంచి 17 వరకు సెలవులు ఇవ్వాలని భావించినప్పటికీ ‘జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమం వల్ల తేదీల్లో మార్పులు చేశారు. అయితే, ఈ మార్పును ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ‘జన్మభూమి’ కార్యక్రమం ఏడో తేదీనే ముగుస్తున్నందున అకడమిక్ క్యాలెండర్ ప్రకారం 8 నుంచి 17 వరకు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News