chiranjeevi: 'సైరా' కోసం సీమ నేపథ్యంలో విలేజ్ సెట్

  • తదుపరి షెడ్యూల్ కి సిద్ధమవుతోన్న 'సైరా'
  • రామోజీ ఫిల్మ్ సిటీలో విలేజ్ సెట్
  • భారీ తారాగణంపై చిత్రీకరణ  

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 'సైరా' సినిమా చేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ శివార్లలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో రాయలసీమ వాతావరణం ప్రతిబింబించే ఒక విలేజ్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. 'నరసింహ రెడ్డి గూడెం' పేరుతో ఈ సెట్ సినిమాలో కనిపించనుందని అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ పర్యవేక్షణలో సెట్ రూపకల్పన జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.

ఈ విలేజ్ సెట్ లో ఒక గ్రూప్ సాంగ్ తో పాటు, ప్రధాన పాత్రధారులంతా పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. విలేజ్ సెట్ నిర్మాణం పూర్తవగానే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.

More Telugu News