Uttar Pradesh: షెడ్డులోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు చిన్నారులు సహా ఏడుగురి మృతి

  • చందౌలి జిల్లాలో ఘటన
  • తీవ్రంగా గాయపడిన మహిళ
  • స్పందించని పోలీసుల సస్పెన్షన్ 

కొత్త సంవత్సరంలో జరిగిన పెను విషాదంలో ఏడుగురు మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌లోని చందౌలి జిల్లాలో మంగళవారం పశువులను మోసుకెళుతున్న ట్రక్కు నేటి ఉదయం 5:30 గంటలకు మాల్దా గ్రామ సమీపంలోకి రాగానే షెడ్డులోకి దూసుకెళ్లింది.

ఈ దుర్ఘటనలో ఏడుగురు మృతి చెందారు. వీరిలో మూడు నుంచి ఎనిమిదేళ్ల వయసు గల నలుగురు చిన్నారులున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను ఆసుపత్రిలో చేర్పించినట్టు పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే స్పందించని కారణంగా ఇద్దరు కానిస్టేబుళ్లు, ఇద్దరు స్టేషన్ హౌజ్ అధికారులను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు.

More Telugu News