akhil: మిస్టర్ మజ్ను నుంచి టీజర్ వచ్చేస్తోంది

  • వెంకీ అట్లూరితో అఖిల్ 
  • నాయికగా నిధి అగర్వాల్ 
  • ఈ నెల 25వ తేదీన విడుదల 

వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ 'మిస్టర్ మజ్ను' సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అఖిల్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. న్యూ ఇయర్ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సినిమా నుంచి ఒక స్పెషల్ పోస్టర్ ను వదిలారు. ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రేపు సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నారు.

ఈ విషయాన్ని కూడా ఈ పోస్టర్ ద్వారానే వెల్లడించారు. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. జనవరి 25వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇంతకుముందు అఖిల్ చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఆయన ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. అఖిల్ అభిమానులు కూడా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. కొత్త ఏడాది ఆరంభంలో అఖిల్ తన ఖాతాలో హిట్ ను వేసుకుంటాడేమో చూడాలి మరి. 

More Telugu News