mumbai: మా అత్తయ్య వల్లే ‘మన్నత్’ ఇంటిని కొన్నాను!: షారూక్ ఖాన్

  • నేను ముంబయికి రాకముందే నా వివాహం జరిగింది
  • భార్య గౌరీతో కలిసి అపార్ట్ మెంట్ లో ఉందామనుకున్నా
  • ‘ఇంత చిన్న ఇంట్లో ఉంటావా?’ అని మా అత్తయ్య అనేవారు

బాలీవుడ్ అగ్రహీరో షారూక్ ఖాన్ ముంబయిలోని తన నివాసం ‘మన్నత్’ గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర విషయాలు చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఈ ఇంటిని షారూక్ కొనుగోలు చేశారు. నాడు జరిగిన ఓ సంఘటన గురించి షారూక్ ఖాన్ ప్రస్తావించాడు. తాను ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని అని, బంగ్లాలో మాత్రమే నివసించాలనేది అక్కడి వారి అభిప్రాయమని అన్నారు.

ఢిల్లీలో ఆర్థికంగా స్థిరపడని వారు సైతం చిన్న బంగ్లాలోనే నివసిస్తుంటారని చెప్పారు. అయితే, ముంబయిలో అలా కాదని, అందరూ అపార్ట్ మెంట్స్ లోనే నివసిస్తుంటారని అన్నారు. తాను ముంబయికి రాకముందే తన వివాహం జరిగిందని, తన భార్య గౌరీతో కలిసి ఓ అపార్ట్ మెంట్ లో ఉందామనుకున్నాను కానీ, తన అత్తయ్య అందుకు అభ్యంతరం చెప్పారని.. ‘ఇంత చిన్న ఇంట్లో ఉంటావా?’ అని ఆమె అన్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు. బాంద్రాలోని సముద్రానికి ఎదురుగా ఉన్న ఇల్లు (మన్నత్)ని  చూసినప్పుడు ఢిల్లీలోని బంగ్లాలు గుర్తొచ్చాయని, అందుకే, ఆ బంగ్లాను కొనుగోలు చేశానని షారూక్ నాటి విషయాన్ని గుర్తుచేసుకున్నారు. తాను ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వాటిల్లో అతి ఖరీదైనది ‘మన్నత్’  అని అన్నారు.  

More Telugu News