congress: కాంగ్రెస్ కు మద్దతును పునరాలోచిస్తామంటూ.. షాకింగ్ కామెంట్స్ చేసిన మాయావతి

  • ఏప్రిల్ లో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా దళితులపై కేసులు
  • రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కేసులు ఎత్తివేయాలంటూ మాయావతి డిమాండ్
  • కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకే పరిమితం కాకూడదు

గత ఏప్రిల్ నెలలో నిర్వహించిన భారత్ బంద్ సందర్భంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో దళితులపై నమోదైన కేసులను ఎత్తి వేయాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని... కేసులను ఎత్తి వేయకపోతే, మద్దతుపై తాము పునరాలోచిస్తామని హెచ్చరించారు. ఏ ఒక్క హామీని బీజేపీ నిలబెట్టుకోలేదని... బీజేపీ మాదిరే కాంగ్రెస్ వ్యవహరించరాదని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం కాకూడదని మాయావతి చెప్పారు. హామీలను ఇవ్వడంలో కాంగ్రెస్, బీజేపీలను ఒకే నాణేనికి రెండు వైపులుగా ప్రజలు భావిస్తున్నారని అన్నారు. ఈ మరకను తొలగించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పైనే ఉందని చెప్పారు.

More Telugu News