2018: విదేశాలకు చెక్కేసిన సెలబ్రిటీలు... ఎవరు ఎక్కడంటే!

  • ఫారిన్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్
  • అమెరికాలో రజనీకాంత్, సింగపూర్ లో కమల్ హాసన్
  • సెల్ ఫోన్ సిగ్నల్ లేని దీవిలో విజయ్ దేవరకొండ

పలువురు భారత సెలబ్రిటీలు విదేశాల్లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకున్నారు. ఎంతోమంది 2019కి స్వాగతం పలికేందుకు విమానాలు ఎక్కి, విదేశాలకు ఎగిరిపోయారు. వారిలో కొందరు ఎక్కడున్నారన్న విషయం ట్రేస్ అయింది.

 రజనీకాంత్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన కుటుంబంతో కలిసి ఆయన కొత్త సంవత్సరం వేడుకలను మరికాసేపట్లో జరుపుకోనున్నారు. కమల్ హాసన్ సింగపూర్ లో ఉండగా, అర్జున్ కూడా అక్కడే ఉన్నారు. నాగచైతన్య, సమంతలు ఆమ్ స్టర్ డామ్ లో ఉండగా, సాయి ధరమ్ తేజ్ అజర్ బైజాన్ లో, విఘ్నేష్, నయనతారలు లాస్ వెగాస్ లో ఉన్నారు. ఇక విజయ్ దేవరకొండ సెల్ ఫోన్ కు సిగ్నల్ కూడా ఉండని ఓ దీవిలో ఉన్నట్టు తెలుస్తోంది.

కాజల్ వియత్నాంలో ఉండగా, పాయల్ రాజ్ పుత్ ఫిజీలో సేదదీరుతోంది. పూజా హెగ్డే న్యూయార్క్ లో, అల్లు శిరీష్ లెబనాన్ లో, రెజీనా ఇజ్రాయిల్ లో వాలిపోగా, న్యూ కపుల్ దీపిక, రణవీర్ లు లండన్ లో కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకుంటున్నారు. కరీనా, సైఫ్ లు స్విట్జర్లాండ్ లో ఉన్నారు. అనుష్క, కోహ్లీలు సిడ్నీలో ఉండగా, సోనమ్ కపూర్, ఆనంద్ లు ఇండొనేషియాకు చేరారు.

అజయ్ దేవగణ్ తన కుటుంబంతో కలసి థాయ్ ల్యాండ్ లో ఎంజాయ్ చేస్తుండగా, కైరా అద్వానీ, దిశా పటానీ మాల్దీవుల్లో, పరిణీతి చోప్రా లండన్ లో ఉన్నారు. రాశీఖన్నా, వాణి కపూర్, ఆలియా భట్, కత్రినా కైఫ్, జాక్వలిన్ ఫెర్నాండెజ్, నిధి అగర్వాల్, ఖుష్బూ తదితరులు దుబాయ్ లో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ వేడుకలు జరుపుకున్నారు.

More Telugu News