NewYear2019: న్యూ ఇయర్ సందర్భంగా వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించిన జియో!

  • రూ.399 రీఛార్జ్ పై వందశాతం క్యాష్ బ్యాక్ 
  • కూపన్ ల రూపంలో లభించనున్న క్యాష్ బ్యాక్ 
  • 'ఏజియో' యాప్ లో లేదా వెబ్ సైట్లో రిడీమ్ చేసుకోవాలి

న్యూ ఇయర్ సందర్భంగా రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం వంద శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ని ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా రూ.399 రీఛార్జ్ చేసుకునే వినియోగదారులు వందశాతం క్యాష్ బ్యాక్ పొందనున్నారు. ఈ క్యాష్ బ్యాక్ కూపన్ ల రూపంలో లభించనుంది. మూడు రోజుల క్రితం నుండే అందుబాటులోకి వచ్చిన ఈ ఆఫర్ వచ్చే నెల జనవరి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్ లో భాగంగా లభించిన కూపన్ లని 'ఏజియో' యాప్ లో లేదా వెబ్ సైట్ లో రిడీమ్ చేసుకోవాలి. మార్చి 15 తేదీ వరకు మాత్రమే కూపన్ లని రిడీమ్ చేసుకోవాల్సి ఉంటుంది.

More Telugu News