tadipatri: తాడిపత్రి వద్ద పోలీస్ వాహనానికి నిప్పు.. సీఐ, కానిస్టేబుళ్లపై దుండగుల దాడి

  • తాడిపత్రిలో మట్కా నిర్వహణ
  • సమాచారంతో అక్కడికి వెళ్లిన కడప పోలీస్ బృందం
  • మట్కా నిర్వాహకుడి ఇంటి వద్దకు చేరగానే దాడి

అనంతపురం జిల్లా తాడిపత్రి వద్ద సీఐ, కానిస్టేబుళ్లపై దుండగులు దాడికి పాల్పడ్డారు. జీపులో వెళ్తున్న సీఐ హమీద్ ఖాన్, కానిస్టేబుళ్లపై కర్రలు, ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఐ తలకు గాయం కాగా, కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారంతో కడప నుంచి పోలీస్ బృందం తాడిపత్రికి వెళ్లింది. మట్కా నిర్వాహకుడు రషీద్ ఇంటి వద్దకు పోలీస్ వాహనం రాగానే దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆ వాహనానికి నిప్పు పెట్టారు. కాగా, ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తగలబడుతున్న వాహనం మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

More Telugu News