Andhra Pradesh: ఒంగోలులో విద్యార్థి సజీవ దహనం కేసు.. తీవ్రంగా స్పందించిన మంత్రి గంటా!

  • ఒంగోలులో కాలి బూడిదైన రాజారెడ్డి
  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
  • తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన విద్యాశాఖ మంత్రి

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పట్టణంలో శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజీ సమీపంలో ఓ విద్యార్థి రెండ్రోజుల క్రితం సజీవదహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో చనిపోయిన యువకుడిని రాజారెడ్డి(16)గా పోలీసులు గుర్తించారు. అనంతరం విద్యార్థి సజీవదహనంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. తాజాగా ఈ దారుణ ఘటనపై ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు.

రాజారెడ్డి మృతిపై మంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరపాలని ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కు ఆదేశాలు జారీచేశారు. వీలైనంత త్వరగా విచారణను పూర్తిచేసి నివేదికను తనకు అందించాలని సూచించారు.

More Telugu News