Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త.. ఐదు నోటిఫికేషన్ల విడుదల

  • ఇటీవల పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్
  • తాజాగా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
  • అత్యధికంగా జూనియర్ లెక్చరర్ పోస్టులు

ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు వరుసపెట్టి శుభవార్తలు చెబుతోంది. ఇటీవల 1051 పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం తాజాగా మరో ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసింది. ఇందులో శాసనసభ అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్‌  పోస్టులు రెండు, ఐఅండ్‌పీఆర్‌ శాఖలో అసిస్టెంట్‌ పీఆర్వో పోస్టులు-15, అకౌంట్స్‌ విభాగంలో డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2 పోస్టులు 20, వ్యవసాయశాఖ అధికారి పోస్టులు -27, ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో జూనియర్ లెక్చరర్ పోస్టులు 237 ఉన్నాయి. వీటన్నింటికీ శుక్రవారం సాయంత్రం ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

More Telugu News