sriram: శ్రీరాముడికి కూడా ఓ ఇల్లు ఇవ్వండి.. రామమందిరం ఆలస్యంపై బీజేపీ నేత వినూత్న నిరసన!

  • అయోధ్య కలెక్టర్ కు ఎంపీ రాజ్ భర్ లేఖ
  • రాముడు టెంట్ లో ఉంటున్నాడని వెల్లడి
  • వెంటనే ఇంటిని కేటాయించాలని లేఖ

అయోధ్యలో రామమందిరం నిర్మాణం విషయంలో బీజేపీ నేత వినూత్నంగా నిరసన తెలియజేశారు. శ్రీరాముడు చాలాకాలంగా టెంట్ లో ఉంటున్నారనీ, ఆయనకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఓ ఇంటిని నిర్మించాలని బీజేపీ నేత హరినారాయణ రాజ్ భర్ కోరారు. ఈ మేరకు అయోధ్య జిల్లా కలెక్టర్ కు ఆయన లేఖ రాశారు.

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి ఇంటిని నిర్మిస్తామని కేంద్రం చెబుతోందని రాజ్ భర్ గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో శ్రీరాముడికి కూడా ఇల్లు లేదనీ, ఆయనకు ఓ ఇంటిని కేటాయించాలని అధికారులను కోరారు. ఆర్డినెన్స్ తీసుకొచ్చి రామమందిరాన్ని నిర్మించాలని హిందూ సంఘాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తుంటే.. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పు వచ్చేవరకూ ఆగాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి.

More Telugu News