allu sirish: 'ఏబీసీడీ' నుంచి ఫస్టులుక్ వచ్చేసింది

  • అల్లు శిరీశ్ హీరోగా 'ఏబీసీడీ'
  • దర్శకుడిగా సంజీవ్ రెడ్డి 
  • ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు

అల్లు శిరీశ్ కథానాయకుడిగా సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో 'ఏబీసీడీ' సినిమా నిర్మితమైంది. మలయాళంలో దుల్కర్ సల్మాన్ హిట్ కొట్టిన సినిమాకి ఇది రీమేక్. మధుర శ్రీధర్ రెడ్డి .. యశ్ రంగినేని నిర్మాతలుగా ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. అల్లు శిరీశ్ మాంచి హుషారుగా .. చలాకీగా ఈ పోస్టర్లో కనిపిస్తున్నాడు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా, యూత్ ను బాగా ఆకట్టుకునే అవకాశం వుంది. కొంతకాలంగా అల్లు శిరీశ్ కి హిట్ అనేది కనిపించకుండా పోయింది. దాంతో ఆయన ఎంతగానో వెయిట్ చేసి మరీ ఈ కథతో ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని ఆయన భావిస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి. ఈ సినిమాతో తెలుగు తెరకి రుక్సార్ మీర్ కథానాయికగా పరిచయమవుతోంది.

More Telugu News