Telangana: చైన్ స్నాచర్లను ఇంకో 2-3 రోజుల్లో పట్టుకుంటాం: తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ

  • హైదరాబాద్ లో రెచ్చిపోయిన స్నాచర్లు
  • రంగంలోకి దిగిన పోలీస్ అధికారులు
  • సీసీటీవీ కెమెరాల్లో దోపిడీలు రికార్డు

తెలంగాణలోని హైదరాబాద్ లో ఇటీవల రెండ్రోజుల వ్యవధిలో 10కిపైగా చైన్ స్నాచింగ్ లు జరగడంపై ఆ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించారు. ఈ ముఠాలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చాయని గుర్తించినట్లు తెలిపారు. వీరిని పట్టుకునేందుకు అధికారులకు ఆదేశాలు జారీచేశామని చెప్పారు. ఈ దోపిడీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయని వెల్లడించారు. చైన్ స్నాచర్లను పట్టుకోవడానికి తక్షణం చర్యలు తీసుకోవాలని రాచకొండ కమిషనర్ ను ఆదేశించామని పేర్కొన్నారు. ఇంకో 2-3 రోజుల్లో నిందితులను పట్టుకుంటామని హోంమంత్రి ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News