Andhra Pradesh: ఇంటర్ అమ్మాయిలకు అర్ధరాత్రి లైంగిక వేధింపులు.. కీచక ప్రిన్సిపల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు!

  • గదిలోకి పిలిపించుకున్న ప్రిన్సిపల్
  • యువతులకు లైంగిక వేధింపులు
  • పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు

విద్యార్థులను దారిలో పెట్టాల్సిన టీచర్ దారి తప్పాడు. కామంతో కళ్లు మూసుకుపోయి తన దగ్గర చదువుకుంటున్న అమ్మాయిలను వేధించాడు. చివరికి ఈ విషయాన్ని బాలికలు ఇళ్లలో చెప్పడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. దీంతో సదరు కామాంధుడిని అరెస్ట్ చేసిన పోలీసులు కటకటాల వెనక్కు నెట్టారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఎలమంచిలిలో గీతాంజలి డిగ్రీ అండ్‌ ఇంటర్‌ కళాశాలను నిర్వహిస్తున్నారు. దీనికి సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకడైన ఈశ్వరదత్తు కాలేజీ ప్రిన్సిపల్, కార్యదర్శిగా వ్యవహరిస్తున్నాడు.

ఈ కళాశాలలో చదువుతున్న అమ్మాయిలు అక్కడే ఉండే హాస్టల్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఈ నెల 12న అర్ధరాత్రి ఇంటర్ విద్యార్థినులను తన గదికి పిలిపించుకున్న ఈశ్వరదత్తు, వారితో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగికంగా వేధించాడు. దీంతో యువతులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈశ్వరదత్తుపై ఐపీసీ 354, 354డీ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను కటకటాల వెనక్కు నెట్టారు.

More Telugu News