Rajamouli: రాజమౌళి అలా ప్లాన్ చేశారట!

  • షూటింగు దశలో రాజమౌళి మల్టీ స్టారర్ 
  • దసరాలోగా షూటింగ్ పూర్తిచేసే ఆలోచన
  • 2020 ఆరంభంలో విడుదలయ్యే ఛాన్స్

చరణ్ .. ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి ఒక మల్టీ స్టారర్ ను రూపొందిస్తున్నారు. ఆంగ్లేయుల పరిపాలన కాలం నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందని అంటున్నారు. బందిపోటుగా ఎన్టీఆర్ .. పోలీస్ ఆఫీసర్ గా చరణ్ కనిపించనున్నారని చెబుతున్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తిచేసుకున్న ఈ సినిమా, రెండవ షెడ్యూల్ కోసం రెడీ అవుతోంది.

ఎన్టీఆర్ .. చరణ్ తరువాత రాజమౌళి ఇంతవరకూ ఇతర ఆర్టిస్టుల వివరాలను ప్రకటించలేదు. దాంతో ఈ సినిమా షూటింగుకే చాలాకాలం పట్టనుందా? షూటింగును ఎప్పటిలోగా పూర్తిచేయాలని రాజమౌళి అనుకుంటున్నారు? అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. ఈ సినిమా షూటింగును దసరా పండుగలోగా పూర్తి చేయాలని రాజమౌళి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. అక్టోబర్ వరకూ చరణ్ .. ఎన్టీఆర్ రాజమౌళికి డేట్స్ ఇచ్చేశారట. దసరా లోపు షూటింగు పార్టును పూర్తిచేసి, ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. 2020 ఆరంభంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు వున్నాయన్న మాట.

More Telugu News