Telangana: వెల్లువెత్తిన అభిమానం.. కుమారుడికి కేసీఆర్ పేరు పెట్టిన వీరాభిమాని!

  • తెలంగాణలోని మహబూబ్ నగర్ లో ఘటన
  • కుమారుడికి కేసీఆర్ అని పేరుపెట్టిన మల్లప్ప
  • అభినందించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వీరాభిమానులు ఉన్నారు. తాజాగా ఓ అభిమాని కేసీఆర్ పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. తన కుమారుడికి ముఖ్యమంత్రి పేరు పెట్టి ఆనందపడ్డాడు. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని మక్తల్ నియోజకవర్గం గుర్లపల్లికి చెందిన తుప్పలి మల్లప్ప టీఆర్ఎస్ కార్యకర్తగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను విపరీతంగా అభిమానించే మల్లప్పకు ఇటీవల కుమారుడు పుట్టాడు. దీంతో పిల్లాడికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని నామకరణం చేశాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గుర్లపల్లికి వెళ్లారు. అనంతరం మల్లప్పను అభినందించి, చిన్నారిని ఆశీర్వదించారు.

More Telugu News