cuddapah: కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం.. రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

  • ఎం.కంబాలదిన్నెవద్ద ఉక్కు కర్మాగారం
  • రేపు ఉదయం 11 గంటలకు శంకుస్థాపన
  • కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోంది: సీఎం రమేశ్

  సీఎం చంద్రబాబు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే ఉక్కు కర్మాగారానికి రేపు ఉదయం 11 గంటలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. రూ.18 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ యోచన. ఈ సందర్భంగా టీడీపీ నేత సీఎం రమేశ్ మాట్లాడుతూ, కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోందని అన్నారు. ఈ విషయమై పలుమార్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి విన్నవించినా స్పందించలేదని, శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతలూ హాజరుకావాలని కోరుతున్నానని అన్నారు.

More Telugu News