white papers: శ్వేతపత్రాల పేరిట చంద్రబాబు తన బాధ్యతను వేరే వారి మీదకు నెట్టేస్తున్నారు: సీపీఎం నేత మధు

  • ఇప్పటికే 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు
  • ఏపీకి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేరలేదు
  • రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేసింది

శ్వేతపత్రాల పేరిట చంద్రబాబు తన బాధ్యతను వేరే వారి మీదకు నెట్టేస్తున్నారని సీపీఎం నేత మధు విమర్శించారు. విజయవాడలో తొమ్మిది వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మధు మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే మూడు శ్వేతపత్రాలను విడుదల చేయడంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పైనా ఆయన మండిపడ్డారు. ఏపీకి బీజేపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేరలేదని, రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోని యూనివర్శిటీలలో ఏడింటికి వైస్ ఛాన్సలర్స్ లేరని అన్నారు. ఈ నెల 28న కరవు మండలాలన్నింటిలో కరవు బంద్ నిర్వహించబోతున్నామని అన్నారు. 

More Telugu News