3rd Test.: మెల్ బోర్న్ టెస్ట్: ముగిసిన తొలిరోజు ఆట

  • భారత్ - ఆసీస్ జట్ల మధ్య మూడో టెస్ట్
  • ఆట ముగిసే సమయానికి 215/2
  • ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ (47), పుజారా (68)

మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్ - ఆసీస్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ లో తొలిరోజు ఆట ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. అరంగేట్రంలోనే అదరగొట్టిన మయాంక్ అగర్వాల్ 76 పరుగులు చేసి అవుట్ కాగా, హనుమ విహారి 8 పరుగులకే వెనుదిరిగాడు. కోహ్లీ (47), చటేశ్వర్ పుజారా (68) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. మరో వైపు ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్ ఒక్కడికే రెండు వికెట్లు దక్కాయి.

More Telugu News