USA: అమెరికాలో అగ్నిప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు తెలంగాణవాసుల దుర్మరణం!

  • బంధువుల ఇళ్లకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు
  • అర్ధరాత్రి చెలరేగిన మంటలు
  • స్మోక్ అలారం లేకపోవడంతో దారుణం

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఐయోవా రాష్ట్రంలోని కొలిర్ విల్లేలోని ఓ ఇంటిలో మంటలు చెలరేగడంతో నలుగురు తెలంగాణవాసులు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారని అధికారులు తెలిపారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో నలుగురు తప్పించుకునే వీలు లేకుండా పోయిందన్నారు. ఈ ఘటనలో కరీ అనే మహిళతో పాటు శారూన్‌నాయక్‌, సుహాస్‌నాయక్‌, జయ్‌సుచిత ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

ఈ ప్రమాదం నుంచి కరీ భర్త డానియెల్, కుమారుడు కోల్ ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. స్మోక్ అలారం లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు. కాగా, చనిపోయిన శారూన్‌నాయక్‌, సుహాస్‌నాయక్‌, జయ్‌సుచితల స్వస్థలం జిల్లాలోని గుర్రపుతండా. అమెరికాలో చదువుకుంటున్న వీరంతా క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో బంధువులైన డానియెల్, కరీ ఇంటికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.  

More Telugu News