paruchuri: ఒక దర్శకుడి మాటకు నాగార్జున ఇచ్చే విలువ అది: పరుచూరి గోపాలకృష్ణ

  • 'శిరిడీసాయి'కి మాటలు రాశాను 
  • నాగార్జునకి ఆ డైలాగ్స్ నచ్చాయి 
  • అయితే ఆ సీన్ పాటలోకి వెళ్లింది   

రచయితగా పరుచూరి గోపాలకృష్ణ అనేక చిత్రాల విజయంలో ప్రధానమైన పాత్రను పోషించారు. తాజాగా ఆయన 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక దర్శకుడి మాటకు నాగార్జున ఎంత విలువ ఇస్తారనే విషయాన్ని గురించి ప్రస్తావించారు. 'శిరిడీసాయి' సినిమాకి నేను మాటలు రాశాను .. వెళ్లి నాగార్జునకి వినిపించాను.

తాత్యా తల్లి చనిపోయే సీన్లో నేను రాసిన డైలాగ్స్ చాలా బాగున్నాయని నాగార్జున అన్నారు. అయితే ఆ సీన్ ను పాటలో భాగంగా వచ్చేలా దర్శకుడు రాఘవేంద్రరావు ప్లాన్ చేశారు. నేను నాగార్జున గారికి ఫోన్ చేసి, ఆ సీన్లో డైలాగ్స్ బాగున్నాయని అన్నారు గదా .. మరి ఆ డైలాగ్స్ రాఘవేంద్రరావు గారు తీసేశారు అని అన్నాను. అప్పుడు నాగార్జున "సార్ .. డైరెక్టర్ విజన్ కి ఆర్టిస్టులు ఎప్పుడూ కూడా అడ్డు పడకూడదు" అన్నారు. దాంతో ఒక దర్శకుడి మాటకు నాగార్జున ఎంత విలువను ఇస్తారనే విషయం నాకు అర్థమైంది. 

More Telugu News