Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నయనతార
  • చరణ్ సినిమావేడుకకు కేటీఆర్!
  • 'గీత గోవిందం' దర్శకుడి తదుపరి చిత్రం 
  • 'మహర్షి' తాజా షెడ్యూల్ పూర్తి   

*  తెలుగు, తమిళ భాషల్లో బిజీ కథానాయికగా రాణిస్తున్న నయనతార సినీ రంగ ప్రవేశం చేసి నిన్నటికి సరిగ్గా పదిహేను సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆమెకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగులో 'సైరా' సినిమాలో చిరంజీవి సరసన నటిస్తున్న సంగతి విదితమే.
*  రాంచరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న 'వినయ విధేయ రామ' చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను రేపు సాయంకాలం హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ను విడుదల చేస్తారని సమాచారం. మరో ముఖ్య అతిథిగా చిరంజీవి కూడా విచ్చేస్తారు.
*  ఆమధ్య 'గీతగోవిందం' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు పరశురాం తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, ఇందులో టాలీవుడ్ ప్రముఖ హీరో నటిస్తాడని పేర్కొన్నాడు. దీనిని బట్టి అల్లు అర్జున్ ఇందులో నటిస్తాడని అంతా ఊహిస్తున్నారు.
*  మహేశ్ బాబు నటిస్తున్న 'మహర్షి' చిత్రం తాజా షెడ్యూల్ పూర్తయింది. రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో నిర్వహించిన ఈ షూటింగులో గ్రామీణ వాతావరణానికి సంబంధించిన సన్నివేశాలను దర్శకుడు వంశీ పైడిపల్లి చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్ వచ్చే నెలలో జరుగుతుంది.     

More Telugu News