Tollywood: 'భారతీయుడు-2’ కోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నాను: హీరోయిన్ కాజల్

  • ‘మగధీర’తో నా సినీ కెరీర్ లో గోల్డెన్ పిరీడ్ మొదలు
  • ఈ సినిమా నాకు ఎంతో ప్రజాదరణ, గుర్తింపు తెచ్చాయి
  • ‘భారతీయుడు-2’తో నా కెరీర్ మరోస్థాయికి వెళుతుంది

2009లో రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ కలిసి నటించిన చిత్రం మగధీర. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందీ, బాక్సాఫీస్ రికార్డులు నెలకొల్పిందీ ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లేదు. ప్రస్తుతం ‘భారతీయుడు-2’ చిత్రంలో నటిస్తున్న కాజల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘మగధీర’ గురించి ప్రస్తావించింది.

‘మగధీర’కు సంతకం చేసిన రోజు నుంచే నటిగా తన గోల్డెన్ పిరీడ్ మొదలైందని చెప్పింది. ఈ సినిమా తనకు ఎంతో ప్రజాదరణ, గుర్తింపు తెచ్చాయని, ఇప్పటికీ ఎంజాయ్ చేస్తున్నానని సంతోషం వ్యక్తం చేసింది. ఇక, శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘భారతీయుడు-2’ చిత్రంలో తాను నటిస్తుండటం చాలా థ్రిల్లింగ్ గా ఉందని, ఈ సినిమా కోసం కొత్త విద్యలు నేర్చుకుంటున్నానని చెప్పింది. ‘భారతీయుడు-2’ చిత్రం తన సినీ కెరీర్ ను మరో స్థాయికి తీసుకెళుతుందని ఆశిస్తున్నట్టు కాజల్ చెప్పింది. 

More Telugu News