andaman: మూడు అండమాన్ దీవుల పేర్లను మార్చనున్న కేంద్ర ప్రభుత్వం

  • 1943 డిసెంబర్ 30న అండమాన్ లో జాతీయ జెండా ఆవిష్కరించిన బోస్
  • అండమాన్ కు షహీద్, నికోబార్ కు స్వరాజ్ అంటూ నామకరణం
  • ఆ పేర్లను పునరుద్ధరించాలని కోరిన నేతాజీ బంధువు

అండమాన్ దీవుల్లోని మూడు దీవుల పేర్లను కేంద్ర ప్రభుత్వం మార్చుతోంది. అండమాన్ దీవుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పర్యటించి 75 ఏళ్లు గడిచిన సందర్భంగా దీవుల పేర్లను మార్చుతున్నారు. హావ్ లాక్ దీవిని స్వరాజ్ ద్వీప్ గా, నీల్ ఐలాండ్ ను షహీద్ ద్వీప్ గా, రాస్ ఐలాండ్ ను నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిగా మార్చనున్నారు.

 1943 డిసెంబర్ 30న పోర్ట్ బ్లెయిర్ లోని జింఖానా గ్రౌండ్ లో నేతాజీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటీష్ పాలన నుంచి విముక్తి పొందిన తొలి భారత భూభాగం అండామాన్ దీవులే అని ఆ రోజు నేతాజీ ప్రకటించారు. అప్పుడు అండమాన్ దీవికి షహీద్ అని, నికోబార్ దీవికి స్వరాజ్ అని సుభాష్ చంద్రబోస్ పేర్లను మార్చారు.

ఈ నేపథ్యంలో, నేతాజీ నామకరణం చేసిన ఆ దీవుల పేర్లను పునరుద్ధరించాలని కోరుతూ నేతాజీ బంధువు, పశ్చిమబెంగాల్ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నెల రోజుల తర్వాత ఆ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఈ చారిత్రక ఘటన సందర్భంగా అండమాన్ కు మోదీ వెళుతున్నారు. 

More Telugu News