naresh: షూటింగులో అమ్మ కళ్ల ముందే బైక్ పై నుంచి పడిపోయాను: నరేశ్

  • అది 'రెండు కుటుంబాల కథ' షూటింగ్ 
  • బైక్ తో జంప్ చేశాను
  • రెండవసారి ప్రమాదానికి గురయ్యాను     

తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ నరేశ్ మాట్లాడుతూ, ఒక షూటింగు సమయంలో జరిగిన ప్రమాదాన్ని గురించి ప్రస్తావించారు. "అమ్మ దర్శకత్వంలో 'రెండు కుటుంబాల కథ' సినిమా చేస్తున్నాను. ఆ రోజున షూటింగులో నేను బైకుతో జంప్ చేయాలి. ఒకసారి బైక్ తో జంప్ చేసినప్పుడు .. మళ్లీ ఒకసారి చేద్దామని అమ్మ అంది. దాంతో మళ్లీ బైక్ తో జంప్ చేశాను.

 ఈసారి బైక్ గాల్లో ఉండగానే నేను దానిపై నుంచి కింద పడిపోయాను. నేరుగా ముఖం నేలకి తగిలింది. దాంతో నేను స్పృహ కోల్పోయాను. ఆ తరువాత మెలకువ వచ్చేసరికి నేను కార్లో వున్నాను. నా ఒళ్లంతా రక్తం .. ట్రాఫిక్ క్లియర్ చేయమని మా అమ్మ రోడ్డుపై పరిగెడుతోంది. నేను బాగానే వున్నానని అమ్మకి చెప్పండి .. అని చెప్పేసి మళ్లీ సృహ కోల్పోయాను. ఆ తరువాత హాస్పిటల్లో మనలోకి వచ్చాను. ఆ ప్రమాదం కారణంగా 3 నెలలపాటు హాస్పిటల్లోనే వున్నాను" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News