xmas: క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్!

  • ప్రస్తుతం యూరప్ లో ఉన్న జనసేన అధినేత
  • ప్రజలు శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్ష
  • ఫేస్ బుక్ లో స్పందించిన జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన కుటుంబంతో కలసి ప్రస్తుతం యూరప్ ఉన్నారు. తాజాగా క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో జనసేనాని ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రిస్మస్ పండుగ ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలను తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలంతా శాంతి, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు జనసేన అధినేత ఫేస్ బుక్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. అలాగే దీనికి క్రిస్మస్ ట్రీ ఫొటోను పవన్ జతచేశారు.

More Telugu News