wifes friend: భార్య స్నేహితురాలికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసిన యువకుడు.. అరెస్ట్ చేసిన పోలీసులు!

  • తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘటన
  • యువతికి కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి అత్యాచారం
  • వీడియో షూట్ చేసి బ్లాక్ మెయిల్

భార్య స్నేహితురాలిపై కన్నేసిన ఓ ప్రబుద్ధుడు దారుణానికి తెగబడ్డాడు. ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సందర్భంగా వీడియోను చిత్రీకరించి బెదిరిస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంపై బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. తమిళనాడులో గత నెల 21న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన సిలంబరసన్‌ (22)కు  షర్మిల అనే యువతితో మూడేళ్ల క్రితం వివాహమయింది. ఈ దంపతులకు ఏడాదిన్నర వయసు ఉన్న బాబు ఉన్నాడు. షర్మిల స్నేహితురాలు(24) వీరి ఇంటికి తరచుగా వచ్చేది. ఈ క్రమంలో ఆ యువతిపై కన్నేసిన సిలంబరసన్ ఆమెను లొంగదీసుకునేందుకు ప్లాన్ వేశాడు. ఓ రోజు భార్య లేని సమయంలో సదరు యువతి ఇంటికి రాగా, కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం మత్తులోకి జారుకున్న ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటనను ఫోన్ లో షూట్ చేశాడు.

ఈ వీడియో ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తూ ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పర్యవసానంగా గర్భం దాల్చిన బాధితురాలు గత నెల 21న మగశిశువుకు జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో సిలంబరసన్ బ్లాక్ మెయిల్ చేస్తూ తనపై పలుమార్లు అత్యాచారం చేసి, గర్భవతిని చేశాడని గుమ్మిడిపూండి మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

More Telugu News