ajith: 'విశ్వాసం' విడుదలకి రంగం సిద్ధం

  • అజిత్ హీరోగా 'విశ్వాసం'
  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి 
  • జనవరి 10వ తేదీన విడుదల

అజిత్ అభిమానులంతా ఇప్పుడు 'విశ్వాసం' సినిమాపైనే దృష్టి పెట్టారు. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని, U సర్టిఫికెట్ ను సంపాదించుకుంది. సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి శివ దర్శకత్వం వహించాడు.

గతంలో శివ .. అజిత్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఘన విజయాలను అందుకున్నాయి. అందువలన ఈ సినిమాపై అంచనాలు వున్నాయి. తమిళనాట హీరోగా అజిత్ కి .. హీరోయిన్ గా నయనతారకి ఒక రేంజ్ లో క్రేజ్ వుంది. చాలా గ్యాప్ తరువాత ఈ ఇద్దరూ కలిసి నటించడం వలన కూడా ఈ సినిమాపట్ల క్రేజ్ పెరగడానికి కారణమైంది. సంక్రాంతికి తెలుగులో గట్టిపోటీ ఉండటం వలన, కొంత గ్యాప్ తీసుకుని తెలుగులో ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

More Telugu News