Xiaomi Mi Play: షియోమీ నుండి 'ప్లే సిరీస్' స్మార్ట్ ఫోన్ విడుదల!

  • 'షియోమీ ఏంఐ ప్లే' విడుదల 
  • ప్లే సిరీస్ నుండి మొదటి మోడల్ స్మార్ట్ ఫోన్
  • ధర సుమారుగా రూ.11,100

మొబైల్ తయారీదారు షియోమీ తాజాగా చైనాలో 'ప్లే సిరీస్' నుండి మొదటి మోడల్ స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేసింది. 'షియోమీ ఏంఐ ప్లే' పేరిట విడుదలైన ఈ ఫోన్ బ్లాక్, డ్రీమ్ బ్లూ, ట్వైలైట్ గోల్డ్ కలర్లలో లభించనుంది. మనదేశంలో సుమారుగా రూ.11,100 ధరకి లభించనున్న ఈ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో లభ్యం కానుంది. 12/2 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ త్వరలోనే భారత మార్కెట్లోకి రానుంది.

More Telugu News