nithin: నితిన్ భుజానికి గాయమైనట్టు నాకు తెలియదు: హీరోయిన్ రష్మిక

  • నితిన్ భుజానికి గాయం 
  • ఆందోళన వ్యక్తం చేసిన రష్మిక 
  • బాగానే ఉన్నానని చెప్పిన నితిన్  

వరుస పరాజయాలతో సతమతమవుతోన్న నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందనను ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేసుకుని, ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్లాలనుకున్నారు.

అయితే నితిన్ భుజానికి గాయమైన కారణంగా ఆలస్యమైందనీ .. వచ్చేనెలలో సెట్స్ పైకి వెళతామని తాజాగా వెంకీ కుడుముల ట్వీట్ చేశాడు. ఆయన ట్వీట్ పై రష్మిక స్పందిస్తూ .."అయ్యో .. నితిన్ భుజానికి గాయమైందా .. నాకు తెలియదు సార్ .. ఇప్పుడు ఆయనకి ఎలా వుంది? ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా" అని ట్వీట్ చేసింది. రష్మిక ట్వీట్ పై నితిన్ స్పందిస్తూ .."రష్మిక నేను ఇప్పుడు బాగానే వున్నాను .. షూటింగులో కలుసుకుందాం" అని ఆయన ట్వీట్ చేశాడు. ఈ సినిమాలో నితిన్ కొత్త లుక్ తో కనిపించనున్నట్టు తెలుస్తోంది. 

More Telugu News