kiya: అనంతపురంలో 500 కోట్లు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్!: విజయసాయిరెడ్డి ఆరోపణ

  • కియా పేరుతో భారీ కుంభకోణం చోటుచేసుకుంది
  • టీడీపీ నేతలు ఎకరాను రూ.2 కోట్లకు అమ్ముతున్నారు
  • ఫేస్ బుక్ లో స్పందించిన వైసీపీ నేత

అనంతపురం జిల్లాలో కియా కార్ల పరిశ్రమ ముసుగులో భారీ భూ కుంభకోణం చోటుచేసుకుందని వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ కుంభకోణం ద్వారా మంత్రి కాల్వ శ్రీనివాసులు సహా ఐదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కోట్లకు పడగలెత్తారని విమర్శించారు. కియా అనుబంధ పరిశ్రమల కోసం ఎకరం స్థలం విలువను రూ.2 కోట్లకు పెంచి అమ్ముతున్నారని దుయ్యబట్టారు.

  టీడీపీ నేతలు ఈ అవినీతి సొమ్ముతో భారీ స్కెచ్ వేశారన్నారు. దోచుకున్న సొత్తుతో అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో 500 కోట్లు వెదజల్లి గెలవాలనేది చంద్రబాబు స్కెచ్ అని దుయ్యబట్టారు. ఈ మేరకు సాయిరెడ్డి ఫేస్ బుక్ లో స్పందించారు.

More Telugu News