Rajanikant: కొన్ని సీన్లు మార్చితే 'యూ' ఇస్తామన్న సెన్సార్ బోర్డు... అంగీకరించని 'పేట్టా' నిర్మాతలు!

  • రజనీకాంత్ నటించిన 'పేట్టా' 
  • క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీన్
  • చిత్రానికి 'యూ/ఏ' సర్టిఫికెట్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'పేట్టా' చిత్రానికి సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాకు సెన్సార్ బోర్టు 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాను చూసిన తరువాత అధికారులు, కొన్ని పోరాట దృశ్యాలను మార్చితే, క్లీన్ యూ సర్టిఫికెట్ ఇస్తామని చెప్పినప్పటికీ, అందుకు చిత్రాన్ని నిర్మించిన సన్ పిక్చర్స్ అంగీకరించలేదని, దీంతో ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' సర్టిఫికెట్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. రజనీకాంత్ తో తొలిసారిగా సిమ్రాన్, త్రిష నటించిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, మేఘా ఆకాశ్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించగా, అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా క్లైమాక్స్ లో భారీ ఫైట్ సీన్ ఉందని, దాని కారణంగానే 'యూ/ఏ' ఇవ్వాల్సి వచ్చిందని సమాచారం.

More Telugu News