Telangana: జగిత్యాల వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆద్భుతం.. విగ్రహం ముందు నుంచి కదలని గరుడ పక్షి!

  • జగిత్యాల జిల్లా కోరుట్లలో ఘటన
  • భారీగా ఆలయానికొస్తున్న భక్తులు
  • ఇంటర్నెట్ లో ఫొటో వైరల్

తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఈరోజు అద్భుతం చోటుచేసుకుంది. కోరుట్ల పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఓ గరుడ పక్షి స్వామివారి ముందు వాలిపోయి అక్కడే ఉండిపోయింది. పూజారి అదిలించినా, భక్తుల అలికిడి అవుతున్నా ఈ పక్షి అక్కడి నుంచి కదలడం లేదు. దీంతో ఈ విచిత్రాన్ని చూసేందుకు పలువురు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More Telugu News