central govenment: కేంద్రం తీరు చూస్తుంటే అక్కడా నిఘా పెట్టేలా ఉంది!: సీపీఐ నేత నారాయణ సెటైర్లు

  • ప్రజల కంప్యూటర్లలో సమాచారం కనిపెడతారా!
  • ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులూ జారీ చేసింది!
  • భార్యాభర్తల కాపురంపైనా నిఘా పెట్టేలా ఉంది

దేశ ప్రజల కంప్యూటర్లలోని సమాచారాన్ని కనిపెట్టేందుకు పది భద్రతా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందంటూ కేంద్రంపై సీపీఐ నేత నారాయణ నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు కూడా జారీ చేసిందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే.. భార్యాభర్తల కాపురంపై కూడా నిఘా పెట్టేలా ఉందని సెటైర్లు విసిరారు. ఈ సందర్భంగా ఏపీ విషయాలను ఆయన ప్రస్తావించారు. అగ్రిగోల్డ్ వ్యవహారం చంద్రబాబు మెడకు చుట్టుకోనుందని అభిప్రాయపడ్డారు. 

More Telugu News