gopichand: స్పై థ్రిల్లర్ నేపథ్యంలో గోపీచంద్ కొత్త సినిమా ప్రారంభం

  • 'తిరు' దర్శకత్వంలో గోపీచంద్ 
  • జనవరి 18 నుంచి రెగ్యులర్ షూటింగ్ 
  • మే నెలలో భారీస్థాయి విడుదల    

కొంతకాలంగా వరుస పరాజయాలు ఎదురవుతూ ఉండటంతో, మంచి కథ కోసం వెయిట్ చేస్తూ గోపీచంద్ కొంత గ్యాప్ ఇచ్చాడు. ఇటీవల దర్శకుడు 'తిరు' చెప్పిన కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కింది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమా ఈ రోజున పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాకి విశాల్ సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. జనవరి 18వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. స్పై థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ సినిమాను మే నెలలో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం కథానాయికల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. త్వరలోనే వాళ్ల పేర్లను ఎనౌన్స్ చేస్తారు. 

More Telugu News