jagan: జగన్ పాదయాత్రలో మరో మైలురాయి.. మొక్కను నాటిన వైసీపీ అధినేత.. వీడియో చూడండి

  • 3,500 కిలోమీటర్లకు చేరుకున్న జగన్ పాదయాత్ర
  • రావివలస వద్ద మొక్కను నాటిన జగన్
  • భారీ సంఖ్యలో జగన్ ను అనుసరిస్తున్న పార్టీ శ్రేణులు

ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వైసీపీ అధినేత జగన్ పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. కడప జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర అన్ని జిల్లాలను దాటి చివరి జిల్లా అయిన శ్రీకాకుళంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు పాదయాత్ర 3,500 కిలోమీటర్లను చేరుకుంది. ఈ సందర్భంగా టెక్కలి నియోజకవర్గం రావివలస వద్ద జగన్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నాయి.


More Telugu News