President Of India: నేడు కరీంనగర్ వెళ్లనున్న రాష్ట్రపతి కోవింద్

  • శీతాకాల విడిది కోసం హైదరాబాద్ విచ్చేసిన రాష్ట్రపతి
  • నేడు ప్రతిమ కళాశాల కార్యక్రమానికి హాజరు 
  • నరసింహన్, సీహెచ్ విద్యాసాగర్ రావు కూడా 

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం నిన్న హైదరాబాద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన బస చేశారు. ఈ రోజు ఆయన కరీంనగర్ లో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో కరీంనగర్ శివారులోని నగునూర్ కు రాష్ట్రపతి చేరుకుంటారు.

ఈ సందర్భంగా అక్కడి ప్రతిమ మెడికల్ అండ్ సైన్స్ కళాశాలలో కొత్తగా నిర్మించిన ఆడిటోరియంను ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావులు కూడా హాజరుకానున్నారు. 

More Telugu News