NTR BIOPIC: ‘ఎన్టీఆర్’ ఆడియోను ఆవిష్కరించిన నందమూరి సోదరులు

  • ఆవిష్కరించిన మోహనకృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ
  • అంగరంగ వైభవంగా జరుగుతున్న వేడుక
  • ఈ వేడుకకు పలువురు ప్రముఖుల హాజరు

ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో సీడీని నందమూరి సోదరులు మోహనకృష్ణ, రామకృష్ణ, బాలకృష్ణ ఆవిష్కరించారు. హైదరాబాద్ లో ఈ సాయంకాలం ఆడియో వేడుక కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు, ఈ చిత్రంలోని తొలి పాటను నందమూరి బాలకృష్ణ కుటుంబసభ్యులు ఆవిష్కరించారు. నారా బ్రాహ్మణి లాంచ్ అని చెప్పడంతో తొలి పాటను ఆవిష్కరించారు.

అంగరంగ వైభవంగా జరిగిన ఈ వేడుకకు ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర యూనిట్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, నటులు రానా, సుమంత్, పరుచూరి సోదరులు, పలువురు దర్శకులు, నిర్మాతలు, పాటల రచయితలు, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు హాజరయ్యారు.

More Telugu News