NTR biopic: ఎన్టీఆర్ ని చూస్తున్నానో లేక బాలకృష్ణను చూస్తున్నానో నాకు అర్థం కాలేదు: పురందేశ్వరి పాత్రధారిణి హిమాన్షి

  • ఈ చిత్రంలో నటించడం నాకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్
  • ఈ పాత్ర కోసం పురందేశ్వరి హావభావాలను గమనించా
  • గొప్ప నటులతో కలిసి నటించడం వెరీ లక్కీగా భావిస్తున్నా 

ఎన్టీఆర్ ని చూస్తున్నానా లేక బాలకృష్ణను చూస్తున్నానో తనకు అర్థం కాలేదని ఎన్టీఆర్ బయోపిక్ లో పురందేశ్వరి పాత్రధారిణి హిమాన్షి చౌదరి చెప్పింది. ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం ‘కథానాయకుడు’ ట్రైలర్ ఈరోజు విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన హిమాన్షి చౌదరిని అక్కడి విలేకరులు పలుకరించగా ఆసక్తికర విషయాలు చెప్పింది.

‘ఈ చిత్రంలో నటించడం నాకు బెస్ట్ ఎక్స్ పీరియన్స్. నన్ను డైరెక్ట్ గా లుక్ టెస్ట్ కు పిలిచినప్పుడు ఆశ్చర్యపోయా. కెమెరా ముందుకు వెళ్లి నిలుచునే వరకూ ఇంతటి ఇంపార్టెంట్ రోల్ నాకు వచ్చిందని నమ్మలేకపోయాను. బాలకృష్ణ, విద్యాబాలన్ వంటి వారితో కలిసి ఓ ముఖ్యపాత్రను నేను చేయడం వెరీ లక్కీగా భావిస్తున్నాను. ఈ పాత్ర కోసం పురందేశ్వరి గారి హావభావాలు, ఆమె మాట్లాడే విధానం.. ఇలా ప్రతిఒక్కటీ తెలుసుకున్నాను. ఆమెలా నేను నటించడానికి దర్శకుడు క్రిష్ గారు చాలా గైడ్ చేశారు’ అని చెప్పింది.

More Telugu News