varun: 'అంతరిక్షం'పై పెదనాన్న ప్రత్యేక శ్రద్ధ పెడుతూ వచ్చారు: హీరో వరుణ్ తేజ్

  • ఉత్కంఠను రేకెత్తించే సీన్స్ వున్నాయి 
  • ట్రైలర్ చూడగానే పెదనాన్న ఫోన్ చేశారు 
  • పెదనాన్నకి నచ్చిందంటే హిట్టే    

వరుణ్ తేజ్ కథానాయకుడిగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'అంతరిక్షం' సినిమా నిర్మితమైంది. తెలుగులో తొలిసారిగా 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి .. అదితీరావు కథానాయికలుగా నటించారు. ప్రపంచవ్యాప్తంగా రేపు ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ .. " రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకి పూర్తి భిన్నంగా ఈ సినిమా ఉంటుంది" అన్నాడు.

అంతరిక్ష పరిశోధన .. స్పేస్ లోను ఉత్కంఠను రేకెత్తించే సన్నివేశాలతో ఈ సినిమా సాగుతుంది. ఒక సందర్భంలో నా సినిమా .. పెదనాన్న 'సైరా' సినిమా పక్కపక్కనే షూటింగు జరుపుకున్నాయి. అప్పటి నుంచి నా సినిమాకి సంబంధించిన విషయాలను పెదనాన్న ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఈ సినిమా విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ కాగానే చూసి నాకు ఫోన్ చేసి చాలా బావుందంటూ ప్రశంసించారు. పెదనాన్న బాగుంది అంటే సినిమా సగం హిట్టైపోయినట్టేననేది న నమ్మకం" అని చెప్పుకొచ్చాడు. 

More Telugu News