Andhra Meals: వావ్.. ఏమి రుచి!.. ఆంధ్రా భోజనానికి డచ్ హైకమిషనర్ ఫిదా!

  • లొట్టలేసుకుంటూ తిన్న డచ్‌ హై కమిషనర్‌ 
  • గుంటూరు జిల్లాలోని ఓ హోటల్ లో ఘటన 
  • భలే రుచిగా ఉందంటూ ప్రశంస

ఆంధ్రా భోజనానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ రుచుల కమ్మదనానికి ఎవరైనా లొట్టలేసుకోవాల్సిందే. ఆంధ్రా వంటకాలకు అంత శక్తి ఉంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఆంధ్రా భోజనాన్ని రుచిచూసిన ఓ విదేశీ ఉన్నతాధికారి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆంధ్రా భోజనం సూపర్ గా ఉందంటూ డచ్‌ హై కమిషనర్‌ మార్టీన్‌ వాన్‌బర్గ్‌ కితాబునిచ్చారు .

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజ గ్రామానికి వెళ్లిన ఆయన ఓ హోటల్ లో ఫుడ్ ఆరగించారు. అనంతరం భలే రుచిగా ఉందంటూ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ భోజనానికి తాను ఫిదా అయ్యానంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. ఈ టేస్ట్ చూశాక.. ఆంధ్రా ఖ్యాతి ఏంటో అర్థమైందన్నారు.

More Telugu News