dhruv: 'పొగరు'లో ప్రొఫెసర్ గా రష్మిక

  • ధృవ్ సార్జా సరసన రష్మిక 
  • దర్శకుడిగా నంద కిషోర్ 
  • మార్చి15వ తేదీన విడుదల  

'గీత గోవిందం' హిట్ తో తెలుగులో రష్మిక మందన క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. విజయ్ దేవరకొండ తదుపరి చిత్రమైన 'డియర్ కామ్రేడ్'లోను ఆమెనే హీరోయిన్. మరికొన్ని ప్రాజెక్టులలో ఆమెని కథానాయికగా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె కన్నడలోను రెండు సినిమాలు చేస్తోంది .. అందులో ఒకటి 'పొగరు'.

ధృవ్ సార్జా కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా రష్మిక ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ పాత్రలో కనిపించనుంది. గంగాధర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి నంద కిషోర్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. మార్చి15వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో రష్మిక పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉందట. అందువలన ఈ సినిమా తనకి మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుందని ఆమె భావిస్తోంది. ఇక తెలుగులో ఆమె క్రేజ్ ను మరింత పెంచడానికి 'డియర్ కామ్రేడ్' ఉండనే వుంది. 

More Telugu News